హైదరాబాద్:డిసెంబర్ 23 : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూపోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు ప్రకటించింది.దీంతో.. కరోనా యాక్టివ్ కేసులు 27 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. హైదరాబాద్లో 8 మందికి, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్గా తేలినట్టు అధికారులు తెలిపారు.తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరినట్ట యింది. ఒక్కరోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్గా తేలింది. అయితే.. హైదరాబాద్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా తేలగా..రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్ప త్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది.కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమ త్తమైంది. ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స కోసం.. ఆయా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.కరోనా కొత్త వేరియంట్.. జెన్-1 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచి స్తోంది. ఆందోళన పడ కుండా అప్రమత్తంగా ఉంటే.. కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చు అని సూచిస్తున్నారు.మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్