(పీపుల్ న్యూస్ – భీమిలి):అడుగడుగునా పూల వర్షం, సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు,డీజే మోతలు,తీన్మార్ ,బాణా సంచా వెలుగులు,కోలాటం అట పాటలు,గుర్రుపు సింహాసన వాహనం, అడుగడుగునా మంగళ హారతులు, గజమాల అలంకరణతోనూ ప్రజలు అవంతి శ్రీనివాసరావుకి పందలపాక పంచాయతీ ప్రజలు ఘనమైన సాదర స్వాగతం పలికారు..హామీల్లో చిత్తశుద్ధి ,అందించే పాలనలో సుభుద్థి కలభూసిన నాయకుడు అవంతి అని ప్రజలు కీర్తించారు.భీమిలి నియోజకవర్గం,ఆనందపురం మండలం,పందలపాక పంచాయతీలో పరిధిలో సోమవారం అవంతి
43వ రోజు ఎన్నికల ప్రచారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో బాగంగా’ అవంతి శ్రీనివాసరావుకి పందలపాక పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరరావు (పంతులు) ఆద్వర్యం లో గొట్టిపల్లి పంచాయితీ ప్రజలు అడుగడుగునా సాదర స్వాగతం పలికారు.ప్రచారం లో బాగంగా ఈ 5ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం తెలుపమని అవంతి ప్రజలను అడగగా…గత ప్రభుత్వాలు పాలనలో మేమంతా లంచాలు తో దళారీ వ్యవస్థ తో నరకం చూసామని వైసిపి ప్రభుత్వం జగనన్న పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మా వద్దకే ప్రతీ పథకం ప్రతీ సేవలు అందుతున్నాయని మా పంచాయితీ లో మీరు మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసారని మళ్ళీ ముఖ్యమంత్రి గా జగనన్న మా భీమిలి కి మీరే రావాలని కోరుకుంటున్నామని ముక్త కంఠంతో తో అవంతి పాలనా నాయకత్వం ని బలపరిచారు .ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టిన తలొగ్గక నిజాయితీ గా దైర్యం గా నిలబడిన దైర్యశీలి సోదరుడు నాగు నాయకుడు అంటే అలా ఉండాలి అని నాగుని అవంతి కొనియాడారు.
పందలపాక లో అవంతి కోసం పోటెత్తిన జనసముద్రం ని చూసి సర్పంచ్ నాగేశ్వరరావు పట్ల అవంతి హర్షం వ్యక్తం చేసారు.మీకు అన్నం పెట్టే వారు ఎవరో సున్నం పెట్టే వారు ఎవరో మా కంటె మీకు బాగా తెలుసు కనుక నిరంతరం ప్రజలు బాగు కోరే మీ అవంతి కావాలో లేక గెలిచాక కనపడని మీ సమస్యలు ఊసే పట్టని వేరొక నాయకుడు కావాలో మీకు మీరుగా ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో మే 13 న ప్యాన్ గుర్తు పై ఓటేసి ఒక్క రోజున నా కోసం నిలబడండి రాబోయే 5ఏళ్ళు మీకోసం మీ మద్య నిలబడతానని అవంతి అన్నారు.ప్రచారం లో బాగంగా సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవి అంటే అదికారంగా కాకుండా ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా ఉండాలన్నదే అవంతి రాజకీయ ప్రస్థానం అని,ఆ ఆలోచన తోనే ఆయన నిరంతరం ప్రజలు మద్యకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారం చేయాల్సినవి చేసి మిగిలిన పనులు అదికారులు కు అప్పగించి త్వరితగతిన చేపట్టాలని చెప్పే గొప్ప నాయకుడన్నారు.మా కంటే అవంతి కోసం మీ అందరికి బాగా తెలుసునని ఏదైనా మంచి చెస్తాను అని మాటిస్తే తప్పనివారని,ఆయన పాలనలో వివక్ష చూపని పాలన,అవినీతి రహిత పాలన ఆయనకు ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడన్నారు., భీమిలి ని మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమం అభివృద్ధి లో నడిపించారని,విశాఖ జిల్లా రాజదాని గా అయితే ఉత్తరాంధ్ర బాగుపడుతుందన్నారు. కనుక జగనన్న పాలనపై మాకంటే లబ్ది పొందిన మీకే బాగా తెలుసు కనుక రాబోయే ఎన్నికల్లో ప్యాన్ గుర్తు పై ఓటేసి ఎంపీ గా బొత్సా ఝాన్సీ ని – ఎమ్మెల్యే గా అవంతి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.అనంతరం ప్రజలతో అవంతి మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను తన ఊపిరి గా చేసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి శ్రేయస్సే ద్యేయంగా ప్రజలు పక్షాన ఓ సైనికుడు లా పాలనతో పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.,వివక్ష చూపకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా ఆర్హత ఉండి కూడా ఏ ఒక్కరు ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలు పొందని అర్హులను జల్లెడ పట్టి మరీ ఏటా రెండు దఫాలుగా ఎలాంటి అవినీతి లంచం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో కే జమ చేసే విధానం రాజకీయ చరిత్ర లో ఒక్క వైసిపి పాలనలో నే చూస్తున్నాం అన్నారు., ప్రజలకు ఉచిత మెరుగైన వైద్యం, కార్పోరేట్ స్కూల్ కి దీటుగా ఉండే విద్య,లంచం లేని వాలంటీర్లు ద్వారా నేరుగా అందే పాలన, మెండుగా పండే రైతన్న ల పంట పండాలన్నా,ఇలా ప్రతీ సంక్షేమం తో కూడిన పాలన కావాలంటే ఆంధ్ర ప్రదేశ్ కి మళ్ళీ జగనే రావాలి అంటూ ఈరోజుల్లో రాజకీయ పాలనలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టడం తో పాటు మాట ఇచ్చి మాట తప్పని నాయకత్వం ఒక్క జగనన్న లోనే చూసామని,ఓట్లు కోసం పని చేసే మనసు జగనన్న ది కాదని ప్రజలు కు మంచి సేవలు అందించడమే ఆయన నాయకత్వం కి నిదర్శనం అని,మానవత్వం ఆయన కులం ప్రజాసేవ నాయకత్వం ఆయన పాలన ప్రస్థానం అని అన్నారు,నేను మీకు మంచి చెసాను అని మీకు అనిపిస్తే నాకు ఓటు వేసి గెలిపించండి అనే నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పాలనలో ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉన్నారని ఇది మరువకుండా రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ నా గెలిపించేలా ప్యాన్ గుర్తు పై ఓటేసి భీమిలి లో తనను గెలిపించాలని అలాగే గెలుపు కై నాయకులు కార్యకర్తలు భాద్యత తో పని చేయాలని పిలుపునిచ్చారు.
అంబరాన్ని తాకిన సంబరం లా ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగించినందుకు సర్పంచ్ నాగేశ్వరరావుని అవంతి మెచ్చుకున్నారు.అనంతరం నాగేశ్వరరావు, అవంతి కి సత్కారం గా చిరు కానుకలు సమర్పించారు .ఈ కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసిపి శ్రేణులు – ఆయా పదవుల్లో ఉన్న వారు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్