May 18, 2024

People News Channel

Best News Web Channel

స్వార్థం కోసం పనిచేసేది టీడీపీ .. హామీలను నెరవేర్చే ప్రభుత్వం వైసీపీ – మజ్జివలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అవంతి

(పీపుల్ న్యూస్ – భీమునిపట్నం);   స్వార్థం కోసం పనిచేసేది టీడీపీ అయితే  ఇచ్చిన మాట తప్పకుండా 90 శాతం  హామీలను నెరవేర్చే ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం అని భీమిలి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. మంగళవారం పెదబాబు ఆధ్వర్యంలో భీమిలి మండలం పరిధిలో గల మజ్జివలస పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతరం అవంతి మాట్లాడుతూ మహిళలకు వైసిపి ప్రభుత్వం జగనన్న పాలనలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ మహిళలకు పదవుల్లో రాజ్యాంగ హక్కులు ను పొందుపరుస్తూ వారికి పదవుల్లోసైతం 60 శాతం రిజర్వేషన్లు కల్పిం చడమే కాకుండా వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్  కే  దక్కిందని అన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి  మహిళలకే మేలు చేసే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టి, నేరుగా  ఖాతా లోకే జమ చేయడం జరిగిందని చెప్పారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా చూసి అన్ని వర్గాల కు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  అలాంటి నాయకుడే మరల ముఖ్యమంత్రి అయితే మరింత పాలన అందిస్తారని కావున  ఆయనకు మద్దతు గా నిలిచి  భీమిలి లో తనకు    – ఎంపిగా బొత్సా ఝాన్సీని ప్యాన్ గుర్తు పై ఓటేసి గెలిపించడానికి మహిళా అక్కాచెల్లెళ్ళు సోదరులైన మీరంతాసిద్దమా అంటే సిద్దం అంటూ మహిళలు జగన్ కావాలి అవంతి అంటూ సంతోషంతో నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండలం వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.