May 18, 2024

People News Channel

Best News Web Channel

రాష్ట్ర సంక్షేమ సారథి జగన్ – భీమిలి ప్రజాసేవా వారిది అవంతి -89వ వార్డులో చంద్ర నగర్,రామాలయం ,ఎల్లపు వాని పాలెం ,ఎస్సి కోలనీ లో ఘనంగా ఎన్నికల ప్రచారం

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  భీమిలి ప్రజాసేవా వారిది అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం లో అలుపెరగని బాటసారై   దూసుకుపోతున్నారు. బుధవారం 89వ వార్డులో చంద్ర నగర్,రామాలయం ,ఎల్లపు వాని పాలెం ,ఎస్సి  కోలనీ లో ఎన్నికల ప్రచారం  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  అవంతి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలనలో వైసిపి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్ని వర్గాలు తో పాటు ఎస్సి,ఎస్టీ,బిసి .మైనారీటీలకు అన్నింటా పెద్దపీట వేయడమే కాక, రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా సంతోషం గా ఉండాలనే ఆలోచనతో రాష్ట్రం అంతటా సంక్షేమం దిశగా అడుగులు వేసారన్నారు. ,గత ప్రభుత్వాలు గత పాలకులు బడుగు బలహీన వర్గాల వర్గాల వారిని కేవలం ఎలక్షన్ లో అధికారం పొందేందుకు ఓటు బ్యాంకు గానే చూస్తే జగన్ మోహన్ రెడ్డి  మాత్రం సామాజిక న్యాయం చేసి సమానత్వం సౌభ్రాతృత్వం అనే విషయాన్ని చేతుల్లో చేసి చూపారని అన్నారు.
,మాటలతో కోటలు కట్టడం జగనన్న రాదు చేతలతో చేసి చూపించడమే ఆయనకు తెలిసిన పాలన ఆయన పార్టీలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం గా ఉన్నారని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా రాబోయేది వైసిపి ప్రభుత్వం అని, సమయం ఎక్కువ లేనందున నాయకులు కార్యకర్తలు భాద్యత వహించి రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని అలాగే ఇదే భీమిలి లో మీ అందరి చల్లని దీవెనలతో గెలిపించారు గతం లో భీమిలి అభివృద్ధి కి ఇప్పటి అభివృద్ధి కి ఎంత తేడా ఉందో మీకు తెలుసు కనుక నిత్యం మీ మద్య ఉండి మీ సమస్యలు అడిగి తెలుసుకునే నేను కావాలో ఎలక్షన్ రోజు కనిపించి తరువాత ఏనాడు కనపడని వాళ్ళు కావాలో మీకు మీరుగా ఆలోచించుకొని భీమిలి లో ప్యాన్ గుర్తు పై ఓటేసి ముచ్చటగా మూడోసారి నన్ను యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ గారి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో 89వ వార్డు వైసిపి శ్రేణులు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు-  సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు – ప్రజలు పాల్గొన్నారు