May 18, 2024

People News Channel

Best News Web Channel

జగనన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు – జగన్మోహన్ రెడ్డి పాలనలో అవ్వ తాతలను పెద్దకొడుకులా ఆదుకున్నారు – తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి సత్యనారాయణ

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):జగన్మోహన్ రెడ్డి పాలనలో అవ్వ తాతలను పెద్దకొడుకులా ఆదుకున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు.21వ వార్డు ఓల్డ్ సిబిఐ డౌన్ వద్ద మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం సభలో పాల్గొని చేసిన మంచి, చేయబోయే సంక్షేమాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి వివరించారు.

తూర్పు నియోజకవర్గంలో మేము సిద్ధం మా బూత్లు సిద్ధం” సభ కార్యక్రమం స్థానిక జీవీఎంసీ 21వ వార్డ్ ఓల్డ్ సిబిఐ డౌన్ వద్ద సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవి సత్యనారాయణ పాల్గున్నారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎంవివి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో కష్టాలను చూశారని, ఈ క్రమంలో పేదల కష్టాలను ఆదుకునేందుకు నవరత్నాల ద్వారా పేదలను ఆదుకున్న గొప్ప మనసు జగనన్నదని అన్నారు.జగనన్న పాలనలోఇచ్చిన హామీలు 100 శాతం నెరవేర్చారన్నారు.