May 18, 2024

People News Channel

Best News Web Channel

బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆడారి ఆనంద్ కుమార్ లకు వీర తిలకం దిద్దిన కొత్తపాలెం మహిళలు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):  బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆడారి ఆనంద్ కుమార్ ల విజయం కాంక్షిస్తూ…హరతులిచ్చి…వీరతిలకం దిద్ది…విజయ మాలలు వేసి…అక్కున చేర్చుకున్నారు విశాఖ పడమర నియోజకవర్గం కొత్తపాలెం మహిళలు…సోమవారం సాయంత్రం విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలు జెండాలు పట్టి వెంటరాగా కొత్తపాలెం లో ఇంటింటి ప్రచారం ఘణంగా జరిగింది.సీఎం జగన్మోహనరెడ్డి బొత్స ఝాన్సీ , ఆడారి ఆనంద్ కుమార్ లకు జే జే లు కొడుతూ వైసీపీ శ్రేణులు హుషారుగా ర్యాలీ తీసాయి.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, పడమర నియోజకవర్గం పరిశీలకులు, పీలా ఉమారాణి, పేడాడ రమణికుమారివార్డు వైసీపీ నాయకులు దొడ్డి కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.