May 18, 2024

People News Channel

Best News Web Channel

‘జగన్ కోసం సిద్దం’ గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం – స్వచ్చంధంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్న లక్షలాది మంది స్టార్ క్యాంపెయినర్లు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47,000 బూత్‌లలో 2.5 లక్షలకు పైగా వైయస్ఆర్సీపీ సైనికులు గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.  ప్రతి కుటుంబం నుంచి వైసీపీ లబ్దిదారులను స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని పిలుపునిస్తున్నారు. ‘జగన్ కోసం సిద్ధం’ ప్రచార కార్యక్రమం  మొదటి రోజున నాగ శుక్రవారం  9 లక్షల మంది లబ్ధిదారులు తమను తాము వైయస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు. జగన్ కోసం సిద్ధం ప్రచారంలో  47,000 బూత్‌లలో విస్తరించి ఉన్న 2.5 లక్షల మంది సైనికులతో వైయస్ఆర్‌సీపీ సైన్యం అసమానమైన ఉత్సాహంతో వాడ వాడల్లో పర్యటించేందుకు ముందుకు వచ్చారు. సీఎం జగన్ సందేశాన్ని, ఆయన దార్శనికతను ప్రతి గ్రామానికి, వాడవాడకు తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధమైంది.   వైసీపీ కార్యకర్తలు జగను  నవరత్నాలు ప్లస్ వైయస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో)ని ప్రతి ఇంటికి అందిస్తున్నారు.  తమ నాయకుడు సీఎం జగన్ నేరవేర్చిన వాగ్దానాలను ఇటీవల చేసిన వాగ్దానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు . ఇంకా, సీఎం జగన్ పథకాల నుండి ప్రత్యక్షంగా లబ్ది పొందిన 9 లక్షల మంది సామాన్యులే తమ తిరుగులేని మద్దతును ప్రదర్శిస్తూ స్టార్ క్యాంపెయినర్లుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు వైసీపీ నాయకులు తెలిపారు.