May 18, 2024

People News Channel

Best News Web Channel

ప్రజాసేవ కు నేనెప్పుడూ సిద్దం – ప్రజలకు మంచి చేయని వారితోనే నా యుద్దం అంటున్న అవంతి

(పీపుల్ న్యూస్ – భీమిలి0;  ప్రజాసేవ కు తాను ఎల్లప్పుడూ  సిద్దమని  అవంతి శ్రీనివాసరావు  అన్నారు. 5వ వార్డు లో పోతిన హనుమంతు రావు గారి ఆధ్వర్యంలో 39వ రోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అవంతి మాట్లాడుతూ నిత్యం మీ కళ్ళు ముందు కనిపించి మీ మద్యలో తిరిగి మీ సమస్యలు అడిగి తెలుసుకుని  పరిష్కారం చేసే నాలాంటి వాడు కావాలా లేక ఎలక్షన్ సమయంలో కనిపించి తిరిగి ఒకసారి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ప్రజలను ఉన్నారనే సంగతి మరిచిపోయిన గంటా శ్రీనివాసరావు కావాలో మీకు మీరుగా ఆలోచించుకొని  ప్యాన్ గుర్తు పై ఓటేయాలని ప్రజలను కోరారు.

దీంతో మా మద్యకు నరంతరం రావడానికి మీకు విసుగు లేకపోయినా ప్రతీ ప్రభుత్వ కార్యక్రమం లో – గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో – అలాగే మాకు సమస్య అంటూ ఉంది అని మీకు చేరవేయగానే మా గడప ముందు నిలిచే మీరే మా నాయకుడు మీరే మాకు కాబోయే ఎమ్యెల్యే రాజన్న కలలు కన్న స్వరాజ్యం జగనన్న తోనే సాద్యం అనేలా ఈ 5ఏళ్ళు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు పాలన అందించారని,పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే జగనన్న పాలన లక్ష్యం అని,ఆయన పాలనలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి మునపటి కంటే ఎక్కువ గా జరిగింది అని,టిడిపి ప్రభుత్వం గతంలో పథకాలు ఎలా ఎగొట్టాలా అని ఆలోచిస్తే జగనన్న మాత్రం పథకం అందకుండా ఒక్కరు కూడా ఉండకూడదని గడప గడపను తట్టి అందించడం చేసారని,ఇదే భీమిలి లో గతంలో అధికారం లో ఉన్న గంటా శ్రీనివాసరావు  ఏనాడు భీమిలి ని పట్టించుకునే దాఖలాలు లేవని,ప్రజలు అసలు ఉన్నారా లేరా అనే భావనే లేదని,ఆయన  వెనకాల ఉన్న నాయకులు ప్రజలు కి అందించే సొమ్ము తినడం తప్పా ప్రజలకు చేసేది ఏమి లేదు అలాంటి నాయకుడు మళ్ళీ భీమిలి కి వచ్చి ఏమి చేస్తారు ఆయన వలన టిడిపి నాయకులు కార్యకర్తలు బాగపడతారు ప్రజలు నాశనం అవుతారు అలాంటి నాయకుడు కాకుండా నిరంతరం ప్రజలు మద్యకు వెళ్ళి వారి బాగోగులు చూసేది ఎవరు అనేది మీకు బాగా తెలుసు కనుక రాబోయే ఎన్నికల్లో  భీమిలి యంయల్ఏ గా గెలిపించేందుకు అందరూ కష్టపడి పని చేయాలని,పార్టీ గెలిచి అదికారం లోకి వేస్తేనే మనకందరకి నియోజకవర్గం లో విలువ ఉంటుంది కనుక నాయకులు కార్యకర్తలు మద్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి అంతా ఒక తాటిపై ఉండి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు .

ప్రచారం లో బాగంగా 5వ వార్డు ఇంచార్జ్ పోతిన హనుమంతు రావు గారు ప్రజలతో మాట్లాడుతూ గత 5ఏళ్ళు లో అవంతి గారు అందించిన సంక్షేమ పథకాలు అమలు మరియు చేసిన అభివృద్ధి కోసం వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో మే 13 న మీరు ప్యాన్ గుర్తు పై ఓటేసి భీమిలి లో మీ అందరి మధ్య తిరుగుతూ మీ కళ్ళ ముందు కనిపించే అవంతి శ్రీనివాసరావు గారి ని యంయల్ఏ గా – విశాఖ జిల్లా యంపి అభ్యర్థి గా బొత్సా ఝాన్సీ గారి ని అఖండ మెజారిటీతో గెలుపించాలని ఓటును అభ్తర్థించారు  ప్రచారం లో అవంతి ప్రజలను జగన్ మోహన్ రెడ్డి  ని మళ్ళీ ముఖ్యమంత్రి గా చేయడానికి మీరంతా సిద్దమా అని అని అడగ్గానే మేమంతా సిద్దం రావాలి జగన్ కావాలి అవంతి అంటూ ముక్తకంఠంతో పలికి సంతోషం తో నినాదాలు తో హారెత్తించారు . వృద్ద మహిళలు మా పెన్షన్ లు ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నిలబెట్టిన గంటా శ్రీనివాసరావు కి ఓటు మేము వేయము మాకు  మేలు చేసిన ప్యాన్ గుర్తు కే ఓటేసి మా మనవడు జగన్ బాబు ను నిన్ను గెలిపించుకుంటాం అంటూ అవంతి కి జై కొట్టారు. 5వ వార్డు మారికవలస లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భీమిలీ లో అవంతి శ్రీనివాసరావు  నీతి నిజాయితీ గల పాలనను మెచ్చి అవంతి సమక్షంలో టిడిపి జనసేన పార్టీ నుంచి 50 కుటుంబాలు వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి చేరికను అవంతి స్వాగతించగా వార్డు వైసిపి శ్రేణులు బలపరిచారు. 5వ వార్డు 39వ రోజు ఎన్నికల ప్రచారం కి విచ్చేసిన భీమిలి యంయల్ఏ అభ్యర్థి అవంతి గారి కి  వార్డు ఇంచార్జ్ పోతిన హనుమంతు రావు గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అడుగడుగునా మంగళ హారతులు తో ఘనమైన సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు వైసిపి శ్రేణులు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు