May 18, 2024

People News Channel

Best News Web Channel

అవంతి గెలుపు – భీమిలి అభివృద్ధి కి మలుపు – చిప్పాడ, కృష్ణంరాజు పేట , మద్దిల పేట,నారాయణ రాజు పేట పంచాయతీలలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

పీపుల్ న్యూస్ – భీమిలి);  భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 42వ రోజు ఎన్నికల ప్రచారం భీమిలి మండలంలో చిప్పాడ, కృష్ణంరాజు పేట , మద్దిల పేట,నారాయణ రాజు పేట పంచాయతీ లలో ఘనంగా నిర్వహించారు. ప్రచారం లో దారిపోడుగునా ఓటర్లు ఒకటే నినాదం నిరంతరం మా మద్యే ఉండే అవంతి అయితేనే తమకు  మేలు చేస్తాడనీ, ఆయన పై ఎవ్వరు పోటీకి దిగినా తామంతా  ప్యాన్ గుర్తు పై ఓటేసి అవంతినే గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో నినాదాలు చేసారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన  అవంతికి డీజే మోతలు, సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు, కోలాటం ,అట పాటలతో  బారీ అశేష జన ర్యాలీ తో జై జగన్ జై అవంతి నినాదాలు తో  అడుగడుగునా ప్రజలు, నాయకులు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో  అవంతి గడప గడపను తట్టి ప్యాన్ గుర్తు పై ఓటేసి ఎమ్మెల్యే గా తనను , ఎంపీ  గా బొత్సా ఝాన్సీ ని అఖండ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

అనంతరం అవంతి  మహిళలతో  మాట్లాడుతూ గత ప్రభుత్వాలు లో మహిళలకు హామీలు ఇవ్వడం తప్పా చేసాంది ఏమీ లేదు వైసిపి ప్రభుత్వం జగనన్న పాలనలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ మహిళలకు పదవుల్లో రాజ్యాంగ హక్కులు ను పొందుపరుస్తూ వారికి పదవుల్లో సైతం 60 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగనన్న కే దక్కిందని, పదవుల్లోనే కాకుండా వారు సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వైయస్సార్ చేయూత,డ్వాక్రా రుణ మాఫీ,ఆసరా ఇలా ఎన్నో నూతన పథకాలు తో నూతన సంస్కరణలు మహిళలను మహారాజులు గా చేసి మహిళలకు  నిలిచారని,గత ప్రభుత్వాలు అధికారం కోసం పాటు పడితే వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మాత్రం ప్రజలు సంక్షేమ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని,ఇచ్చిన మాటకు కట్టుబడి  మీ మహిళలకే మేలు చేసే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టిన నేరుగా మీ ఖాతా లోకే జమ చేయడం జరిగింది అని,మహిళలు అంతా జగనన్న వెంటే ఉన్నారని,గత ప్రభుత్వం లో పెదోడు ఏడిస్తే జగనన్న ప్రభుత్వం లో ఉన్నోడు ఏడుస్తున్నాడని కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా ప్రజలు పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు అదికారులు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగకుండా వాలంటీర్లు ద్వారా నేరుగా ప్రజలకే సేవలు అందించడం జరుగుతుంది అని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా చూసి అన్ని వర్గాల కు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , అని అలాంటి నాయకుడే మరల ముఖ్యమంత్రి అయితే మరింత పాలన అందిస్తారని మీరంతా ఆయనకు మద్దతు గా నిలిచి రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం గెలుపుకు తోడ్పాడాలని పిలుపునిస్తూ మాట్లాడారు .

అనంతరం రాబోయే ఎన్నికల్లో  ప్యాన్ గుర్తు పై ఓటేసి రాష్ట్రంలో జగనన్న ను – భీమిలి లో నన్ను యంయల్ఏ గా – విశాఖ జిల్లా యంపి గా బొత్సా ఝాన్సీ గారి ని  గెలిపించడానికి మహిళా అక్కాచెల్లెళ్ళు – సోదరులైన  మీరంతా సిద్దమా అంటే సిద్దం అంటూ మహిళలు  జగన్ రావాలి  – కావాలి అవంతి అంటూ సంతోషం తో నినాదాలతో హోరెత్తించారుఈ కార్యక్రమంలో – భీమిలి  మండలం వైసిపి శ్రేణులు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు –   సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు