May 18, 2024

People News Channel

Best News Web Channel

పిలిస్తే పలికే నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు – అవంతి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు

(పీపుల్ న్యూస్ – మధురవాడ): పిలిస్తే పలికే నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రజలు ముక్త కంఠం తో అంటున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం పలువురు అవంతి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మధురవాడ జోన్ పరిధిలో ఐదు  కళింగ వైశ్య  సంఘల అధ్యక్ష కార్యదర్శులు ఆధ్వర్యంలో సుమారు 50 మంది వైయస్సార్ పార్టీలో చేరారు. అలాగే పీఎం  పాలెం   యువత , ముస్లిం కాలనీ యువకులు సుమారు 50 మంది వైయస్సార్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అవంతి మాట్లాడుతూ గత 5ఏళ్ళు లో  అందించిన సంక్షేమ పథకాలు అమలు  చేసిన అభివృద్ధిని వివరించారు.  భీమిలి లో మీ అందరి మధ్య తిరుగుతూ మీ కళ్ళ ముందు కనిపించే అవంతి తనను ఎమ్మెల్యే  – విశాఖ జిల్లా యంపి అభ్యర్థి గా బొత్సా ఝాన్సీ  ని అఖండ మెజారిటీతో గెలుపించాలని కోరారు.