(పీపుల్ న్యూస్ – మధురవాడ): పిలిస్తే పలికే నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రజలు ముక్త కంఠం తో అంటున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం పలువురు అవంతి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మధురవాడ జోన్ పరిధిలో ఐదు కళింగ వైశ్య సంఘల అధ్యక్ష కార్యదర్శులు ఆధ్వర్యంలో సుమారు 50 మంది వైయస్సార్ పార్టీలో చేరారు. అలాగే పీఎం పాలెం యువత , ముస్లిం కాలనీ యువకులు సుమారు 50 మంది వైయస్సార్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అవంతి మాట్లాడుతూ గత 5ఏళ్ళు లో అందించిన సంక్షేమ పథకాలు అమలు చేసిన అభివృద్ధిని వివరించారు. భీమిలి లో మీ అందరి మధ్య తిరుగుతూ మీ కళ్ళ ముందు కనిపించే అవంతి తనను ఎమ్మెల్యే – విశాఖ జిల్లా యంపి అభ్యర్థి గా బొత్సా ఝాన్సీ ని అఖండ మెజారిటీతో గెలుపించాలని కోరారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్