(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):అసలీ రాష్ట్రానికి ఏమవుతోందనీ, అత్తారింటికి దారేది లాగా మన రాష్ట్రానికి దారేదంటూ గంటా రవితేజ వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం,గండిగుండం పలు గ్రామాల్లో ఉపాధి కూలీల సాధక బాధకాలను తెలుసుకుంటూ తన తండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తరపున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజలు నిరాశనిస్పృహలకు లోనయ్యారన్నారు అందుచేతనేమో జగన్మోహన్ రెడ్డి బయటకు తిరగడానికి సాహసించడం లేదని విమర్శించారు.
అన్ని అర్హతలున్న మెజార్టీ ప్రజలకు న్యాయం జరగట్లేదని ప్రచారంలో కొంతమంది మహిళలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రజల్లో నిరాశ నిస్పృహలు తొలగాలంటే చంద్రబాబు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటి కుళాయిలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి గంటా శ్రీనివాసరావు హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు అదే అభివృద్ధి నేటి వరకు కొనసాగుతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే అసెంబ్లీ ,పార్లమెంట్ అభ్యర్థులైన గంటా శ్రీనివాసరావు,శ్రీ భరత్ లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇది మన కోసం కాదని … భావితరాల భవిష్యత్తు కోసమని ఈ నేపథ్యంలోనే తెదేపా,జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రాన్ని సమర్ధవంతంగా గాడిలో పెట్టే నాయకుడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడేనన్నారు. గ్రామాలలో అస్తవ్యస్తమైన కాలువల నిర్మాణాలతో ప్రజల అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్