May 18, 2024

People News Channel

Best News Web Channel

వైసీపీ తీర్థం పుచ్చుకున్న తాళ్లవలస జనసైనికులు – అవంతి సమక్షంలో వైసీపీ కండువాలు వేసుకున్న యువత

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో యాతపేట గ్రామానికి చెందిన జనసైనికులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీ మేనిఫెస్టో నచ్చి తమకు తాముగా వచ్చి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నవరత్నాలను పూర్తిగా విజయవంతం చేయడం చూసి ఇచ్చిన మాట తప్పకుండా పని పూర్తి చేయటం చూసామనీ, అవంతి కూడా ప్రజలలోనే ఉంటాడని , అవన్నీ దృష్టిలో పెట్టుకుని భీమిలిలో అవంతి కార్యాలయంలో భీమిలి మండలం వైసిపీ యూత్ ప్రెసిడెంట్ చిల్ల హరి ఆధ్వర్యంలో అవంతి చేతుల మీదుగా వైసిపి కండువా వేసుకోవడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ ఇకపై ఆ పంచాయతీలో గ్రామ అభివృద్ధి కోసం కష్టపడి అవంతిని గెలిపించుకుంటామని వైసీపీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ,బోని సన్నిబాబు,అక్కారమానిఅప్పలనాయుడు,గోలగానిసన్యాసిరావు,చిల్లరాంబాబు,పాసి అప్పలనరసయ్య,ఎరుసుగోవింద,రమణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.