May 18, 2024

People News Channel

Best News Web Channel

అమ్మకి అన్నం పెట్టలేని వాడు.. పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా – చంద్రబాబు మీద ప్రజలకు విశ్వసనీయత లేదు – న్నికల ప్రచారంలో అవంతి

(పీపుల్ న్యూస్ – మధురవాడ);  చంద్రబాబు నాయుడు పాలనలో వెన్నుపోట్ల స్కాములకు పెట్టింది పేరని వైస్సార్సీపీ  భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీవీఎంసీ  ఆరో వార్డు పరిధిలో కొమ్మాది జంక్షన్, రిక్షా కాలనీ ,ఎస్సీ కాలనీ ,అమరావతి నగర్ ,కొమ్మాది విలేజ్, కే1 కే2 కాలనీ లు ,రేవల్లపాలెంలో ఆయన  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే అమ్మకి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాను అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు మీద విశ్వసనీయత లేదని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి నమ్మకం ఉందని అన్నారు .

గంటా శ్రీనివాసరావు కి ఒక పార్టీ లేదు నియోజకవర్గం లేదు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వ్యక్తిని అతను ఒక రాజకీయ అవకాశవాదని రాజకీయాలను వ్యాపారంగా మాత్రమే చూస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎంపీ లకు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో  వైఎసార్సీపీ  6వ వార్డు ఆద్యక్తులు బొట్టా అప్పలరాజు , వైఎస్సార్సీపీ  7వ వార్డు బిసి సెల్ అధ్యక్షులు బంగారు ప్రకాష్ ,సీనియర్ వైసీపీ నాయకులు పసుపులేటి గోపి ఇతర నాయకులూ పాల్గొన్నారు