May 18, 2024

People News Channel

Best News Web Channel

గంటా శారదమ్మకు ఘన స్వాగతం – సింహాచలంలో టిడిపి కార్యాలయం ప్రారంభం – మహళల సమస్యలపై భరోసా – స్వాగతం పలికిన 98 వ వార్డు కార్పొరేటర్‌ – అధిక సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు

(పీపుల్ న్యూస్ – సింహాచలం); భీమిలి మాజీ  శాసనససభ్యులు గంటా శ్రీనివాసరావు సతీమణి గంటా శారదమ్మకు సింహాచలంలో ఘన స్వాగతం లభించింది. 98 వ వార్డు వార్డు కార్పొరేటర్‌ పి.వి. నరసింహం, వార్డు అద్యక్షుడు పంచదార్ల శ్రీనివాసరావు అధ్వర్యంలో దేశం కార్యలయం నుండి మార్కెట్‌ ఏరియా వరకు ర్యాలీగా వెళ్ళి బాణాసంచాతో స్వాగతం పలికారు . అక్కడనుండి నేరుగా మధ్యవీధిలో ఏర్పాటుచేసిన టీడీపీ కార్యాలయాన్ని హర్షధ్వాననాల మధ్య ప్రారంభించారు. ఈ మేరకు శారదమ్మకు అడుగడుగునా మహిళలు నుదుటున కుంకుమ దిద్ది హారతులతో నీరాజనాలు పలికారు.

ఈ సందర్భంగా శారదమ్మ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి మహిళలకు రక్షణ  కరువైందన్నారు. జగన్‌ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందన్నారు. మంత్రులు శాసనసభలో మహిళలను కించపరిచేవిధంగా మాట్లాడినా జగన్‌ మౌనం వహించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ పి.వి.నరసింహం అధ్వర్యంలో కో`ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఉపాధ్యక్షులు బంటుబిల్లి మహేష్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహం మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు నియోజక అభ్యర్థిగా ఎమ్‌.భరత్‌ను, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యునిగా గంటా శ్రీనివాసరావుకు సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మహిళలను కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ పి.వి.నరసింహం, వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాసరావు, జనసేన అద్యక్షుడు మజ్జి  సురిబాబు, బీజేపీ అధ్యక్షుడు బి.అప్పలనాయుడు, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సతివాడ శంకరరావు, టీడీపీ సీనియర్‌ నాయకులు గుడిసి శంకరరావు, శీర కృష్ణ, కో`ఆపరేటివ్‌ బ్యాంక్‌ మాజీ ఉపాధ్యక్షులు రాజనాల సత్యారావు, వార్డు మాజీ అద్యక్షులు ఎం.కె.గోపాల్‌, లండ బాబుజి, జనసేన జనరల్‌ సెక్రెటరీ ముద్దాడ అనిల్‌ కుమార్‌, తెలుగు యువత అధ్యక్షులు గుసిడి అవినాష్‌, మజ్జి చంద్ర శ్రీనివాసు, లండ పెద్ద శ్రీనివాస్‌, లండ వెంకట్రావు, మజ్జి శ్రీనివాసు(బన్ని) అశోక్‌, చినబాబు, ముత్యాలు , గంట్ల నాగరాజు, తిరపతి శ్రీను, కె.రామకృష్ణ , కూటమి నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు