(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):
భీమిలి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా వైసీపీ నుంచి టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు సింహాచలం ప్రాంతంలో కూడా మొదలయ్యాయి. వైసీపీ నాయకుడు, అడివివరం కో ఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు బంటుపిల్లి మహేష్ – గంటా శ్రీనివాసరావు సతీమణి శారద సమక్షంలో మంగళవారం పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ గల టిడిపిలో పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. సింహాచలం ప్రాంతం టిడిపికి ఎప్పుడూ కంచుకోట అని చెప్పారు. రాష్ట్రం అంతా చూసేలా భీమిలిలో టిడిపికి అఖండ మెజారిటీ తీసుకురావాలని పిలుపునిచ్చారు. వార్డు కార్పొరేటర్ పిసిని వరహా నరసింహం (పీవీ) ఆధ్వర్యంలో జరిగిన చేరిక కార్యక్రమం వైసీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. మహేష్ చేరిక ఆరంభం మాత్రమేనని ఇంకా అనేకమంది వైసీపీ నాయకులు టిడిపి వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గుసిడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్