May 18, 2024

People News Channel

Best News Web Channel

పిలవగానే పలికే వ్యక్తీ అవంతి – మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):   ఆపదలో ఉన్నవారెవరైనా పిలవగానే పలికే వ్యక్తి మన అవంతి అని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన్ను మనం కచ్చితంగా గెలిపించుకోవాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం జీవీఎంసీ ఒకటో వార్డు చక్కెరవలసలో కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి, రామునాయుడుతో కలిసి మేయర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తగరపువలస సమీపంలో జరిగిన ప్రచార యాత్రలోనూ ఆమె పాల్గొనే మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే మొహం చూపించే వ్యక్తి కన్నా నిత్యం కనిపించే భీమిలి వైసీపీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుని గెలిపించాలని, మనం పని మీద వెళ్తే గంటల కొలదీ వేచి చూసే మనిషి కన్నా మన కోసం ఎదురు చూసే వ్యక్తి అవంతి అని ఆయన్ను ఎమ్మెల్యేగా, బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపిద్దామన్నారు. అవంతి మాట్లాడుతూ సీఎం జగన్ చొరవతో ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరిగిందని, మళ్లీ జగనన్నను సీఎం చేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్దించారు.