(పీపుల్ న్యూస్ – భీమిలి); దేశ రక్షణలో అసువులు బాసిన వీర సైనికుడికి మాజీ మంత్రి, భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ బుధవారం నివాళులు అర్పించారు. భీమిలి జీరుపేట కు చెందిన చిల్ల ట్రినాధరెడ్డి ఆర్మీలో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో పని చేస్తున్న త్రినాథ్ ఆదివారం మరణించగా పార్ధీవ దేహాన్ని భీమిలిలోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు అప్పన్న, దుర్గ, భార్య పావని కన్నీరు మున్నీరుగా విలపించారు. రవితేజ వారిని ఓదార్చి దేశ రక్షణ కోసం త్రినాథ్ చేసిన సేవలను శ్లాఘించారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్