(పీపుల్ న్యూస్ – మధురవాడ): జీవీఎంసి ఐదవ వార్డు పరిధి పరదేశి పాలెం లో వార్డు టీడీపీ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ టిడిపిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, జనసేన అధ్యక్షులు దేవర శివ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని,కావున ప్రజలందరూ ఒక్కసారి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కూటమి అభ్యర్థులైన భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావును, విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ను అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని, ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు,భీమిలి నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మిశ్రీను,జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ బోయి శ్రీకాంత్ రెడ్డి,టీడీపీ ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్, జనసేన ఉపాధ్యక్షులు దారపు సూరిబాబు,ఇమంది శ్రీను,ఈశ్వరరావు,ధర్మారావు,సింహాచలం నాయుడు,వార్డ్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్, ఓలేటి శ్రావణ్,ముకర రవికుమార్, వంక నూకరాజు,మదీనా,మాధవ, రాంబాబు,జ్ఞానేశ్వరరావు, జనసేన నాయకులు సిద్దు, రమణ, మోహన్ గోపాల్,గౌరీ, సంతోష్,నారాయణ ,శర్మ , కిరణ్, ఆశోక్,రాజేశ్,నరేష్,వెంకట సాయి, టిడిపి నాయకులు నల్లన ఆనందరావు,అప్పన్న, యువత అధ్యక్షులు కొండపురాజు, పోరా అప్పల సూరిబాబు రెడ్డి, టిడిపి మహిళ నాయకులు మిత్తాన రవణమ్మ,బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు,దుర్గారావు, రామ నాయుడు, గంటా రమేష్,నారాయణ స్వామి, టిడిపి , జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్