May 18, 2024

People News Channel

Best News Web Channel

రాబోయేది మహిళ పక్షపాత ప్రభుత్వం – ఉపాధి హామీ కూలీలకు గంటా రవితేజ భరోసా

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):  రాబోయేది మహిళ అభ్యున్నతికి కట్టుబడి ఉండే మహిళా పక్షపాతి ప్రభుత్వమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ భరోసా ఇచ్చారు. మంగళవారం పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ లో మహిళల కోసం రూపొందించిన పథకాలను వివరించారు. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల  1,500 భృతి, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అన్ని 15 వేల రూపాయలు, పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని ఆయా పథకాలపై అవగాహన కల్పించారు. మహిళల డ్వాక్రా పథకాన్ని రూపశిల్పి చంద్రబాబు ఆర్థిక స్వావలంబన కల్పించారని రవితేజ అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్.పి.టి.సి. దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు కె.రమణ, మాజీ ఎంపీపీలు లీలావతి, కాళ్ల నగేష్ కుమార్, మజ్జి నందీశ్వరరావు, మాజీ సర్పంచ్ మజ్జి శ్రీనివాస్, వి.సురేష్, కాళ్ల సత్యన్నారాయణ, కె.ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.