(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం): బంగారు భవిష్యత్తు కోసం ఓటే ఆయుధమని భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలలో ‘ఓట్ ఫర్ బెట్టర్ ఫ్యూచర్’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రం బాగుపడాలంటే ఓటే ఆయుధమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఎస్ఐ జాతీయ సెక్రటరీ జనరల్ డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి, జాతీయ ఉపాధ్యక్షుడు(సౌత్) యు.ఎస్.శర్మ, బి.విజయప్రసాద్, విశాఖపట్నం చాప్టర్ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్