(పీపుల్ న్యూస్ – మధురవాడ ); ఇంటర్నేషనల్ స్పీకర్ శామ్యూల్ కర్మోజీ ఆధ్వర్యంలో ఎండాడ సెంటర్ చర్చ్ లో ఆదివారం క్రైస్తవుల సమావేశం జరిగింది. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ పాల్గొన్నారు. భీమిలి ఎమ్మెల్యేగా 2014-19 మధ్యలో గంటా శ్రీనివాసరావు రూ.3,800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ చర్చిలో ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో చర్చి సభ్యుడు టీడీపీ నాయకుడు బలగ సుధాకర్ పాల్గొన్నారు
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్