(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం) : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో ఒకటో వార్డు బాలాజీ నగర్ లో గంటా రవితేజ ఇంటింటా ప్రచారం ప్రారంభించారు.2014 – 19 సంవత్సరాల మధ్య భీమిలి నియోజకవర్గం లో తన తండ్రి గంటా శ్రీనివాసరావు చేసిన అభివృద్ధి పనులు మరల అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఆశాభావం వ్యక్తం చేశారు.విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి బాలాజీ నగర్, బంగ్లామెట్టలలో తన తండ్రి గంటా తరఫున ఎన్నికల ప్రచారం ఫుల్ జోష్ తో నిర్వహించారు.. మహిళలు హారతులు పట్టారు. ఇంటింటికి తిరుగుతూ తెదేపా మేనిఫెస్టో కరపత్రాలను కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు.
ఈ నేపద్యంలో పథకాలను ప్రజల్లో అవగాహన కల్పించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.తెదేపా హయాంలోనే భీమిలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించిందన్నారు. అప్పటి అభివృద్ధే ఇవాళ్టి వరకు కనబడుతోందన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో శిలాఫలకాలు తప్ప ప్రారంభోత్సవాలు లేవన్నారు. తన తండ్రి గంటా శ్రీనివాసరావు రాకను భీమిలి నియోజకవర్గం ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు.పల్లె, పల్లెల్లోనూ గ్రూపులన్నీ కలిసికట్టుగా నీరాజనాలు పలుకుతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో తెదేపా అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భీమిలి నియోజవర్గ అభ్యున్నతికి, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రణాళికా బద్ధంగా నియోజవర్గంలోని దీర్ఘకాలిక, మధ్యస్థ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు స్థానిక కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు..
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్