(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం); భీమిలి నియోజవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
భీమిలి నియోజకవర్గం భీమిలి మండలం, మూలకుద్దు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి శ్రీధర్, బవిరిశెట్టి శ్రీను, బి అప్పారావు, వై పృథ్వీ, బి చిట్టిబాబు, వై శివ, వై వెంకట లక్ష్మీ, డి పైడిరాజు మరియు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సుమారు 150 కుటుంబాలకు చెందిన వారు భీమిలి నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా భీమిలి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కండువాలను వేసుకున్నారు.
అలాగే వలందపేటకు చెందిన బవిరిశెట్టి రాంబాబు, బి వాసు, బి పూర్ణ, అచ్చి బాబు, బి బుజ్జి మరియు సుమారు 100 మంది వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు, నాయకులకు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయి తీరాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోరాడ రాజబాబు, 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ అప్పలనాయుడు, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు, మాజీ ఎంపీపీ యరబాల కృష్ణవేణి అనిల్ ప్రసాద్, 2వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ బడిగొండ అప్పలనాయుడు, నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి – ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై దృష్టి సారించాలి – ఆర్వోలకు సూచించిన జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ. మల్లికార్జున