May 18, 2024

People News Channel

Best News Web Channel

టిడిపిలోకి భీమిలి మండలం వైసీపీ నాయకులు – పార్టీలోకి స్వాగతం పలికిన గంటా

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):భీమిలి మండలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు భీమిలి టిడిపి కార్యాలయంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని గ్రామాలకు గ్రామాలు టీడీపీలో చేరడం సంతోషం కలిగిస్తోందన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని చెప్పారు.

చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కష్టించి పని చేయాలన్నారు. మూలకుద్దు ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి శ్రీధర్, బవిరిశెట్టి శ్రీను, బి.అప్పారావు, వై పృథ్వీ, బి.చిట్టిబాబు, వై.శివ, వై. వెంకట లక్ష్మీ, డి.పైడిరాజు సహా 150 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. అలాగే వలందపేటకు చెందిన బవిరిశెట్టి రాంబాబు, బి.వాసు, బి.పూర్ణ, అచ్చిబాబు, బి.బుజ్జి సహా మరో 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిడిపిలో చేరారు‌.
కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు, 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ అప్పలనాయుడు, భీమిలి మండల పార్టీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్.రాజు, మాజీ ఎంపీపీ యరబాల కృష్ణవేణి అనిల్ ప్రసాద్, 2వ వార్డు పార్టీ అధ్యక్షుడు బడిగొండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.